Friday, April 3, 2015

మంచి ఉపాధ్యాయుడంటే బీయేలూ ఎమ్మెలు చదవడమో, బీ ఈడినో ఎమీడీ దెగ్రీలు పేరువెన్స్క తగిలించుకోవడమో కానే కాదని రుజూచేసిన వాళ్ళు,నాలుగయిది డశాబ్దాలక్రితం అసంఖ్యాకంగా దొరుకుతారనీ, వాళ్ళు వేసుకునే బట్టల ద్వారాకూడా ఆఘౌరవం
అధికస్య అధికం ఫలమన్న రీతిలో ఉండదనీ,జాతీయ స్థాయిలోనో
రాష్ట్ర స్థాయిలోనో  ఉత్తమ ఉపాధ్యాయుడిగా పెరూ బిరుదులోపురస్కారాలవేటో వారిని ప్రభావితం చెయ్యలేవని నేను గాఢంగా నమ్మ వలసిన అవసరం మావూళ్ళో కోమటి వీరయ్యగారిని చూసిన ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుందని నా గట్టి నమ్మకం.వాళ్ళు ప్రభుత్వమిచ్చే దివ్యమైన జీతాలప్రభావం కానే జాదని ఇట్టే అందరికీ అవగరమౌతుంది,

ముతక ఖద్దరు బట్టలలో[ఇరవై నంబరనే వాళ్ళని గుర్తు.] అప్పటికే కొంత తెల్లబడినమీసాలతో బగా చిలికిన వెన్నా నీగడలందించిన దేహ పుష్టితో అలరారే మూర్తి విగ్రహం ఆయబది. ఉదయం ప్రారంభంలో సేఅస్వతీ నమస్తుభ్యంతో --- మొదలెట్టి మసక మసక చీకటి పడకముందే దీపంజ్యోతి పరబ్రహ్మం శ్లోకాన్ని వల్లించమంటూ మాతో గొంతు కలిపే దాకా ఆయన చదువు చెప్పడంకొన సాగేది.మాదహ్హర బండెదుపుస్తకాలను మోసే అవసరమూ ఉండేదిగాదు.ఓమట్టి పలక[మార్కాపురం పలకలనే వారు] ఆరర్వాత కొంత కాలానికి రేకు పలకలు లొతలొటలాడుతూ వచ్చాయి. ఆపెద్ద పలకలోనే అన్ని బబ్జెక్ట్ల సారం రంగరించ బడి ఉండేవి.అప్పట్లో ఆయన ఎక్కాలు చెప్పడం అప్పగించుకుమే తీరు చాలా భిన్నంగా వుండేది.పిల్లలమే ఒకరికొకరం ఎదురెదురుగా నిలబడి
అప్పజెప్పుకుంటూఉంటే దీఖతో ఆయన బహు ఏకాగ్రతతో గమనించే వారు.తప్పు చెప్పామా చింత [సగం పచ్చిది] బరికెతో సన్మానం మొదలయెది.            అన్న సూత్రం ఆయనకు పూర్తిగా తెలిసో లేదా తెలిసినా ఆ సిద్ధాంతంతో ఆయబ యేకీభవించలేకపోవడం అప్పటి చదువుకో వాలన్న తపన అయ్యుడొచ్చునేమో గూడా.రెండు పాములనుబోలిన  తోలు బెత్తాలతో సత్కార భయమో మమ్మల్ను తప్పులు వల్లించే
తీరాన్నుంచి దూరంగా జరిపేవి.ఆయన పారితో షికంబెలకు పదురూపాయలలోపే ఉండేది.కారణం ఆయన జీవనో పాధి శే ద్యం.ఈ చదువుచెప్పడంప్రవృత్తి. పిల్లలుగూడా రూపాయో అర్ధో నెల నెల చదివించుకునే వారు. ఇక శతకాలంటారా ఆయననోట  శుద్ధంగా పలకబడదానికి సిద్ధమయేవి.రోజుకో పద్యమే చెప్పే వారు. అక్కడే నాలుగు సార్లు ప్రతివిద్యార్ధీ వల్లించే వారు.అందుకే దాశరధీ,భాస్కర,నరసిమ్హ శతకాలు తరగతుల వారీగా ఉండేవి. చిన్న తరగతుల్లోవెమన సుమతీ శతకాలు,కృష్ణ,కుమారీ [మగపిల్లలకు] కుమారీ శేతకం చెప్పే వారు.యే పుస్తకమో చేతబట్టీన గుర్తూ లేదు.అలా మాకు పట్తుబడి ఇప్పత్లో నాలుకపై ఆడే పద్యాల ప్రాభవమాయన పెట్తిన భిక్షేనని ఒప్పుకుని గొప్పగా చెప్పుకోక తప్పదు.నాలుగోతరగతికొచ్చేసరికి పెద్ద బాల శిఖ మాకు కరగ్రహణమై కళ కళ లాడేది.
ఉత్తమ ఉపాధ్యాయుడెవరన్న దాన్ని వివరించాలనో
నిర్వచించి తీరాలనో నేనీ ప్రయత్నం చేయబోవడంలేదు.
వాళ్ళకు రాష్ట్రపతి పురస్కారాలకోసం సిఫార్సు చేయమనీ
ఎవరినీ అభ్యర్ధించడంలేదు.ఊరికే నాకు తెలిసినంతవిన్నంత
కన్నంతా మీకు పంచుకోవాలని ప్రయత్నమేతప్ప, ఇప్పుడు పురస్కారాలందుకున్న వారినీ వారిసామర్ధ్యాన్ని తక్కువచేయాలన్న తలంపూ నాకులేదు.

అప్పట్లొ తెనాలి దగ్గర సంగంజాగర్లమూడి జిల్లా పరిషద్ ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయుడిగా కొత్త రాజ బాపయ్య గారు పనిచేసే వారు.పిల్లలను ప్రేమిస్తూనే వారి వ్యక్తిత్వాన్ని వారిలో
విలువలను పెంచడంలోనూ అశేషమైన కృషిజేసారు. పిల్లలకు పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తూపై అధికారులను పర్యవేక్షించమనీ అభ్యర్ధించేవారు.

అలాగే పిల్లలలో నిజాయితీ పెంచేదిశగా పోస్ట్ ఆఫీసులోలా కార్దులూ కవర్లూ పెట్టి నిజాయితీగా పిల్లలు ఆ సదుపాయాన్ని వాడుకునేలా ప్రయత్నించే వారు.ఎవరిచేతనయినా ఆ లెక్క చూడమనే వారు. ఒక్క పైసాకూ డా తేడా వచ్చిన సందర్భాలు రాలేదని చెప్పుకునే వారు.
క్లుప్తంగా వారి జీవిత విశేషాలు
--------------------------------
క్లుప్తంగా వారి జీవిత విశేషాలు
--------------------------------
1913-జులై ఒకటతేదీన-తెనాలితాలూకా జాగర్లమూడిలో జననం.
ప్రాధమిక విద్యా స్వగ్రామంలోని ప్రాధమికపాఠశాలలో.

ఉన్నత విద్య కొల్లూరు ఉన్నత పాఠశాలలో

తరువాత గుంటూరు ఏ సి.కలాశాలలో బీ. ఏ పట్టభద్రత
1937 లో బె ఈడి.
1937-38 లో రేపల్లెలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయునిగా చేరారు.15 సంవత్సరాలపాటు,గణితశాస్త్రో పాధ్యాయునిగామరో 15 యేండ్లపాటు ప్రధానోపాధ్యాయునిగా.

వారు కూచిపూడి  కోగంట్తి ఉన్నత పాఠశాప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న కాలంలో ఆయన లెక్కలు చెప్పే తీరు మరియూ క్రమ శిక్షణకు ముచ్చటపడిన విద్యార్ధులు బహు దూర ప్రాంతాలనుండి వచ్చి ఆయన దగ్గర చదువుకునే వారట.

ఆకలి ఆక్రందన
=================
ఆకలి కడుపుతోనే ఈ భూమ్మీదకు దిగబడ్దాను
ఎప్పుడూరుచికరమైన తిండిని తిన్న జాతకమే లేదు.
చిన్ని వసతితోనే అమ్మ బొజ్జలో సర్దుకుపోతూ పెరిగాను.
కడుపునిండా భోజనం చేసిన దాఖలా మాత్రం కనరాదు.

పిడచగట్టుకుపొయిన మెతుకులనే మృష్టాన్నమనుకుని తినిమురిసాను.

గ్రీష్మం అడుగుపెడుతుంటేనే
గుండెలో గుబులు మొదలవుతుంది.

నిరుడు నాసహోదరుడు ఈ ఋతువులోనే కన్నుమూసాడు.
ఆకలి బాధ తట్టుకోలేకనే అసువులు బాసుంటాడనుకున్నారు .

వచ్చే యేడాది నావంతు వస్తుందేమోననే
భయోత్పాతంతో వణికిపోతున్నాను.
పేదరికం పెద్దపీటవేసుకున్న కొద్దిపాటి పూరిపాక మాది
పేదరికంలో పుట్టి అందులోనే గిట్టడం మాయింట రివాజుగా మారింది.
=================================================